
హైదరాబాద్, సూర్య న్యూస్: నగరంలో వాహనదారులు డ్రైవింగ్ (Driving) చేసే సమయంలో మొబైల్ ఫోన్లు (Mobile Phones) ఉపయోగించడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Saifabad Traffic Police) నడుం బిగించారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి జంక్షన్ (Telangana Talli Junction) వద్ద ప్రత్యేక డ్రైవ్ (Special Drive) నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్న 62 మంది వాహనదారులను పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. వీరందరికీ భారీగా జరిమానాలు (Penalties) విధించిన పోలీసులు.. అనంతరం వారికి కౌన్సెలింగ్ (Counseling) నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు. అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే వాహనాన్ని పక్కకు ఆపి మాట్లాడాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు (Road Safety Rules) పాటించని వారిపై ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.