|   
🔴 BREAKING NEWS ► Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ల రికార్డ్, ఖాతాలో మరో రెండు స్వర్ణాలు BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే
Skip to content

Teenmar Mallanna : ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి చెక్.. ఇందిరా పార్క్ కు కదలిరావాలని తల్లిదండ్రులకు సంచలన పిలుపు

Hyderabad, Surya News: తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల (Private Schools) ఫీజుల దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సిద్ధమైంది. విద్యా హక్కు చట్టం (RTE Act) అమలు కోసం ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ (Indira Park) వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొనాలని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) పిలుపునిచ్చారు.

రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు చట్టం (Right to Education) ద్వారా పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు దక్కాల్సి ఉంది. కానీ ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కోర్టులు ఆదేశించినా సరే ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. అక్షరం ఎప్పటికీ అమ్మకానికి కాదని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తులు (Corporate Forces) స్కూలు ఫీజుల పేరిట సామాన్యుల రక్తాన్ని పిండుతున్నాయని ఆయన మండిపడ్డారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

అప్పులు చేసి చదువులు కొనాల్సిన దుస్థితి నుంచి ఇకనైనా బయటపడాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. ఇన్నాళ్లు తెలియక మోసపోయామని, ఇప్పుడు మన హక్కులు తెలుసుకుని కూడా ఇంట్లో కూర్చుంటే బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన వారమవుతామని ఆయన హెచ్చరించారు. సామాన్యుడికి సైతం నాణ్యమైన చదువు దక్కాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం ఒక్క రోజు సమయం కేటాయించాలని ఆయన కోరారు. ఈ నెల 26న జరిగే ఛలో ఇందిరా పార్క్ (Chalo Indira Park) మహాధర్నాను విజయవంతం చేసి ఫీజుల దోపిడీని ఎండగట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp