Skip to content
Home » Telangana 10th Results : విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల! మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!

Telangana 10th Results : విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల! మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!

Hyderabad, Surya News: తెలంగాణ పదో తరగతి (Telangana SSC) విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలను (Class 10 Results) రాష్ట్ర విద్యాశాఖ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ప్రాంగణంలో ఉన్న గోదావరి ఆడిటోరియంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

95.15 శాతం ఉత్తీర్ణత

​ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలలో 96.26 శాతం మంది పాస్ కాగా, బాలురలో 94.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, హైదరాబాద్ జిల్లా అత్యల్ప ఉత్తీర్ణతను నమోదు చేసింది.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి​

పరీక్షలు రాసిన 5.28 లక్షల మంది విద్యార్థులు తమ ఫలితాలను కింద పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) ఎంటర్ చేసి చూడవచ్చు.​

https://results.bsetelangana.org

​https://results.bse.telangana.gov.in

​https://bse.telangana.gov.in

​https://schooledu.telangana.gov.in​

అధికారిక వెబ్‌సైట్లు మొరాయిస్తే విద్యార్థులు మీసేవ (MeeSeva) వాట్సాప్ నంబర్ 8096958096 కు ‘Hi’ అని మెసేజ్ పంపి కూడా ఫలితాలను పొందవచ్చు. జూన్ 5 నుండి సప్లిమెంటరీ (Supplementary) పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.