Skip to content

AP SSC Results 2026: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

అమరావతి, సూర్య న్యూస్: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (AP SSC Results 2026) పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో గణనీయమైన పురోగతి కనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గత ఏడాది ఇది 72.8 శాతంగా ఉండటం గమనార్హం. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 82.68 శాతంతో నిలిచారు.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (Direct Link)

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు. అలాగే ‘మన మిత్ర’ (Mana Mitra) వాట్సాప్ నెంబర్ 9552300009 కు “Hi” అని మెసేజ్ చేయడం ద్వారా లేదా లీప్ (LEAP) మొబైల్ యాప్, డిజిలాకర్ (DigiLocker) ద్వారా కూడా మార్కుల జాబితాను పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp