
హైదరాబాద్, సూర్య న్యూస్ : ‘బేబీ’ (Baby) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా మరో చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమా పేరు ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ (EPIC – First Semester). ఈ సినిమాకు ‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ (90s Web Series) ఫేమ్ ఆదిత్య హాసన్ (Aditya Hasan) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ (Movie Teaser) విడుదల కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న వైష్ణవి చైతన్యను ఇబ్బంది పెట్టింది. ‘బేబీ’ సినిమా తర్వాత ఇమేజ్ మార్పు అవసరం కదా, ఆ మార్పు ఈ ‘ఎపిక్’ సినిమా అనుకోవచ్చా అని సదరు విలేకరి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆమె ఇబ్బంది పడటం గమనించిన హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు ఆదిత్య ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎవరి కోణంలో ఆ మార్పు చూస్తున్నారు అంటూ దర్శకుడు ఆదిత్య (Director Aditya Hasan) రిపోర్టర్ ను తిరిగి ప్రశ్నించారు.
దీనిపై హీరో ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాలోని క్యారెక్టర్ (Movie Character) బట్టి నటీనటుల ఇమేజ్ ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కెరీర్ మొత్తం ఒకే ఇమేజ్ తో కొనసాగడం ఏ నటుడికైనా సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ‘బేబీ’ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులందరి నుండి ప్రశంసలు దక్కాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ‘ఎపిక్’ (EPIC) చిత్రంలో కూడా ఆమె చాలా బలమైన పాత్రను పోషిస్తుందని తెలిపారు.
సాధారణంగా బలమైన మహిళా పాత్రలు ఉన్న సినిమాలు ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు. అలాంటి అరుదైన అవకాశాలు మూడేళ్ల వ్యవధిలోనే ఆమెకు రెండు రావడం విశేషం అని ఆనంద్ దేవరకొండ ప్రశంసించారు.