
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : న్యూఢిల్లీ వేదికగా ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit 2026) విజయవంతం కావడంపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) దౌత్య నైపుణ్యంతో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం పట్ల విదేశీ మీడియా సానుకూలంగా స్పందించింది. ఇరాన్ యుద్ధ పరిస్థితులు, వాణిజ్య ఆంక్షల వేళ భారత్ సాధించిన ఈ విజయం పట్ల పలు ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.
భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన ఈ శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. బ్రిక్స్ వేదికగా భారత్ సాధించిన ఘన విజయాన్ని ‘జపాన్ టైమ్స్’ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న క్లిష్ట సమయంలోనూ సభ్య దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో నరేంద్ర మోదీ దౌత్య విధానం అద్భుతంగా ఫలించిందని ‘బ్లూమ్బెర్గ్’, ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలు ప్రశంసించాయి.
గ్లోబల్ సౌత్ పవర్గా గుర్తింపు
ఈ కూటమి భవిష్యత్తు పరిణామాలపై వివిధ దేశాల పత్రికలు తమదైన కోణంలో విశ్లేషణలు అందించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్.. గ్లోబల్ సౌత్లో ఒక ఎమర్జింగ్ పవర్గా ఎదుగుతోందని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. కాగా, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యల కారణంగానే ఈ కూటమి మరింత బలోపేతం అయిందని, ఆయన తన చర్యలతో బ్రిక్స్కు ఒక మంచి ఏజెంట్గా మారారని ‘అల్ జజీరా’ పత్రిక సెటైర్లు వేయడం గమనార్హం.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



