|  
FLASH NEWS
Vijay Sai Reddy : నెంబర్ 1 సజ్జల, నెంబర్ 2 జగన్.. 74 అవమానాలు భరించలేకే కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన లేఖ  •  Nepal Floods 2026 : కష్టకాలంలో ఆదుకున్న భారత్‌కు నేపాల్ అధ్యక్షుడి భావోద్వేగ సందేశం.. వరదల్లో ప్రాణనష్టంపై కన్నీటిపర్యంతం  •  Singer Mangli Case : మంగ్లీతో రాజీ పడలేదు.. ఆమెను కాపాడుతున్న కేంద్ర మంత్రి ఎవరు.. అడ్వకేట్ సుబ్బు సంచలన వ్యాఖ్యలు  •  AIMIM MLC Expelled : ఎంఐఎం ఎమ్మెల్సీపై బహిష్కరణ వేటు.. ఆ వీడియోల వ్యవహారమే అసలు కారణమా?  •  Vijay Mallya : నాకో న్యాయం వాళ్లకో న్యాయమా.. 22 వేల కోట్ల బకాయికి 6 కోట్లతో సెటిల్మెంటా?  • 
Skip to content

Mudragada Padmanabham Death : కాపు ఉద్యమ శిఖరం నేలకొరిగింది.. ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాకినాడ, సూర్య న్యూస్ : కాపు ఉద్యమ నేత (Kapu Leader), మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం గత నెల 16న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సింధు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి (Kirlampudi) తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ముద్రగడ కుటుంబ నేపథ్యం ఇదే..​

ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయనకు భార్య పద్మావతి, కుమారులు బాలూ, గిరిబాబు, కుమార్తె క్రాంతి ఉన్నారు. ఆయన తండ్రి వీర రాఘవరావు ప్రత్తిపాడు నుంచి రెండుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి ఆకస్మిక మరణంతో 25 ఏళ్ల వయసులోనే ముద్రగడ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం..​

తన రాజకీయ జీవితంలో ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా సేవలందించారు. 1978లో తొలిసారి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి కేబినెట్లలో ఆయన మంత్రిగా పనిచేశారు. 1999లో టీడీపీ తరపున కాకినాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 తర్వాత ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన, 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

​కాపు రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం..​

కాపులను బీసీల్లో (BC Category) చేర్చాలని ముద్రగడ సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం ఏకంగా ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో తుని వేదికగా ఆయన నిర్వహించిన కాపు ఐక్య గర్జన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పవన్‌పై సవాల్.. పేరు మార్పు..

​2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడిన ముద్రగడ, 2024 జూన్ 20న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.

ప్రముఖుల తీవ్ర సంతాపం..​

ముద్రగడ మరణవార్త పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పేర్కొన్నారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ ప్రార్థించారు. కాపు సామాజిక వర్గానికి ఆయన పెద్దదిక్కుగా నిలిచారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సంతాప సందేశంలో కొనియాడారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp