|   
🔴 BREAKING NEWS ► TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే
Skip to content

Vaibhav Suryavanshi Fastest Fifty : 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 20 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు.. తొలి ట్రోఫీ ఎత్తిన తెలుగోడు

దంబుల్లా, సూర్య న్యూస్ :శ్రీలంక ఏ (Sri Lanka A) మరియు ఇండియా ఏ (India A) జట్ల మధ్య జరిగిన ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టును 66 పరుగుల తేడాతో ఇండియా ఏ చిత్తు చేసింది. ఈ అద్భుత విజయంతో సిరీస్ ట్రోఫీని భారత జట్టు సగర్వంగా కైవసం చేసుకుంది. తెలుగు తేజం తిలక్ వర్మ (Tilak Varma) కెప్టెన్‌గా తన తొలి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించాడు.

​ఈ ఫైనల్ మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విశ్వరూపం చూపించాడు. కేవలం 11 బంతుల్లోనే అర్ధ శతకం (Half Century) పూర్తి చేసి సరికొత్త అధ్యాయానికి తెరలేపాడు. 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు (World Record) నెలకొల్పాడు. గత 20 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు అవలీలగా బద్దలు కొట్టాడు. వైభవ్ మొత్తం 29 బంతుల్లో 11 సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో ఏకంగా 94 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 భారీ పరుగులు నమోదు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ 67 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రయాంశ్ ఆర్య 39 పరుగులు, అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లో 39 పరుగులు, కుమార్ కుశాగ్ర 36 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన శ్రీలంక ఏ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌట్ (All Out) అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

వైభవ్ సూర్యవంశీకి ముందు ఈ అత్యంత వేగవంతమైన అర్ధ శతకం రికార్డు శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నే పేరిట ఉండేది. అతను 2006లో రాగమ క్రికెట్ క్లబ్ (Cricket Club) తరఫున ఆడుతూ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ పాత రికార్డును ఇప్పుడు వైభవ్ చెరిపేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్ (ODI) విభాగంలో చూసుకుంటే ఏబీ డివిలియర్స్, మాథ్యూ ఫోర్డ్ పేరిట 16 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డులన్నీ ఈ భారత యువ కెరటం దెబ్బకు మరుగున పడిపోయాయి.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp