Skip to content
Home » CM Revanth Reddy : మూసీ ఒడ్డున రూ. 700 కోట్లతో ఓంకారేశ్వరాలయం.. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

CM Revanth Reddy : మూసీ ఒడ్డున రూ. 700 కోట్లతో ఓంకారేశ్వరాలయం.. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సరికొత్త ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గండిపేట మండలంలోని మంచిరేవుల వద్ద మూసీ నది (Musi River) ఒడ్డున భారీ ఓంకారేశ్వర గుడి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం లాంఛనంగా శంకుస్థాపన చేశారు. వీరభద్రస్వామి మరియు మచిలేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోనే ఈ నూతన ఆలయాన్ని నిర్మించనున్నారు.

సుమారు 8 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 700 కోట్ల భారీ బడ్జెట్ (Budget) ను కేటాయించింది. భవిష్యత్తులో ఈ ఆలయ నమూనా ఎలా ఉండనుందో తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది. మూసీ సుందరీకరణలో భాగంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం గొప్ప పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా (Spiritual Tourism) మారనుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

ఓంకారేశ్వర ఆలయానికి సంబందించిన ఆలయ నమూనాను విడుదల చేశారు.

ఆ వీడియో మీకోసం.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.