|   
🔴 BREAKING NEWS ► TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్ Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు
Skip to content

CM Revanth Reddy : మూసీ ఒడ్డున రూ. 700 కోట్లతో ఓంకారేశ్వరాలయం.. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సరికొత్త ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గండిపేట మండలంలోని మంచిరేవుల వద్ద మూసీ నది (Musi River) ఒడ్డున భారీ ఓంకారేశ్వర గుడి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం లాంఛనంగా శంకుస్థాపన చేశారు. వీరభద్రస్వామి మరియు మచిలేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోనే ఈ నూతన ఆలయాన్ని నిర్మించనున్నారు.

సుమారు 8 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 700 కోట్ల భారీ బడ్జెట్ (Budget) ను కేటాయించింది. భవిష్యత్తులో ఈ ఆలయ నమూనా ఎలా ఉండనుందో తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది. మూసీ సుందరీకరణలో భాగంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం గొప్ప పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా (Spiritual Tourism) మారనుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఓంకారేశ్వర ఆలయానికి సంబందించిన ఆలయ నమూనాను విడుదల చేశారు.

ఆ వీడియో మీకోసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp