
Nalgonda, Surya News: నల్గొండ (Nalgonda) జిల్లా దామరచర్ల (Damaracherla) బీసీ గురుకుల పాఠశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం సమయంలో అన్నం సరిపోక మళ్లీ పెట్టమని విద్యార్థినులు అడిగారు. దీనిపై ఆగ్రహించిన ప్రిన్సిపాల్ వారికి కఠిన శిక్ష విధించారు. ఎక్కువ అన్నం మరియు ఎక్కువ కూరలు హాస్టల్ లో పెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం వారిని రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు సుమారు గంటపాటు మోకాళ్లపై నిలబెట్టారు. భవిష్యత్తులో ఎవరైనా అన్నం సరిపోలేదని అడిగితే అందరికీ ఇదే గతి పడుతుందని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు.
విద్యార్థినుల పట్ల పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ చర్యపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేసిన సదరు ప్రిన్సిపాల్ ను తక్షణమే డిస్మిస్ (Dismiss) చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
విద్యార్థినులు మొబైల్ లో చిత్రీకరించిన వీడియో ను కింద చూడవచ్చు.