|   
🔴 BREAKING NEWS ► TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్ Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు
Skip to content

Telangana Gurukula News : అన్నం అడిగితే మోకాళ్లపై నిలబెట్టిన ప్రిన్సిపాల్.. దామరచర్లలో దారుణం.. అసలేం జరిగిందంటే..

Nalgonda, Surya News: నల్గొండ (Nalgonda) జిల్లా దామరచర్ల (Damaracherla) బీసీ గురుకుల పాఠశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం సమయంలో అన్నం సరిపోక మళ్లీ పెట్టమని విద్యార్థినులు అడిగారు. దీనిపై ఆగ్రహించిన ప్రిన్సిపాల్ వారికి కఠిన శిక్ష విధించారు. ఎక్కువ అన్నం మరియు ఎక్కువ కూరలు హాస్టల్ లో పెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం వారిని రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు సుమారు గంటపాటు మోకాళ్లపై నిలబెట్టారు. భవిష్యత్తులో ఎవరైనా అన్నం సరిపోలేదని అడిగితే అందరికీ ఇదే గతి పడుతుందని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు.

విద్యార్థినుల పట్ల పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ చర్యపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేసిన సదరు ప్రిన్సిపాల్ ను తక్షణమే డిస్మిస్ (Dismiss) చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

విద్యార్థినులు మొబైల్ లో చిత్రీకరించిన వీడియో ను కింద చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp