|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

నకిలీ అనుమతులకు హైడ్రా బ్రేక్ : నెక్నాంపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా: రూ.54 కోట్ల విలువైన భూమి స్వాధీనంరంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ పరిధిలోని నార్సింగి గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ ఎన్‌క్లేవ్ సెక్రటేరియట్ కాలనీలో హైడ్రా అధికారులు బుధవారం భారీ ఆక్రమణలను తొలగించారు సర్వే నంబర్ 31లో పార్కు మరియు ప్రజా అవసరాల కోసం కేటాయించిన 2700 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ప్లాట్లుగా మార్చి నిర్మాణాలు చేపట్టారు ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.54 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు పక్కనే ఉన్న సర్వే నంబర్ 22లోని ప్లాట్ అనుమతులను చూపిస్తూ ఈ ప్రజా స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు విచారణలో తేలింది

సెక్రటేరియట్ కాలనీలో మెరుపు దాడి

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

సెక్రటేరియట్ ఉద్యోగుల కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి విచారణ జరిగింది విచారణలో ఆక్రమణలు ధృవీకరించబడటంతో హైడ్రా బృందం వెంటనే రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేసింది మొత్తం 2700 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే త్రెస్‌పాసర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్రజా అవసరాల కోసమే ఈ స్థలం

2007లో హుడా ఆమోదించిన లేఅవుట్ ప్రకారం ఈ స్థలం కేవలం పార్కు మరియు సామాజిక అవసరాల కోసమేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి ఇలాంటి విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టడంపై అధికారులు సీరియస్ అయ్యారు హైడ్రా తీసుకున్న ఈ చర్యతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూములను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ ఆపరేషన్ ద్వారా హైడ్రా మరోసారి స్పష్టం చేసింది స్వాధీనం చేసుకున్న భూమిని పూర్తిస్థాయిలో రక్షించేందుకు స్థానిక సంఘాలతో కలిసి మరిన్ని చర్యలు చేపట్టనున్నారు

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp