Skip to content
Home » అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో విజయవంతంగా పాములపై అవగాహన సదస్సు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో విజయవంతంగా పాములపై అవగాహన సదస్సు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU) క్యాంపస్‌లో శనివారం నిర్వహించిన “పాములపై అవగాహన కార్యక్రమం” అత్యంత విజయవంతమైంది. విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ మరియు జువాలజీ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఈ సదస్సు విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందిలో ఉన్న అపోహలను తొలగించడంలో కీలక పాత్ర పోషించింది.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. విశిష్ట అతిథిగా ఇక్రిశాట్ డైరెక్టర్ డాక్టర్ హిమాన్షు పాఠక్ విచ్చేసి సదస్సును తిలకించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాములను సంరక్షించాల్సిన ఆవశ్యకతను వివరించిన నిర్వాహకులను వారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

హైదరాబాద్‌కు చెందిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ ప్రతినిధులు ఈ సదస్సును సమర్థవంతంగా నిర్వహించి, పాముల రక్షణ మరియు పర్యావరణ సమతుల్యతలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. పాముల పట్ల ప్రజల్లో ఉన్న అనవసర భయాలను పోగొట్టడం, వాటిని చంపకుండా సురక్షితంగా ఎలా సంరక్షించవచ్చో ఈ సదస్సు ద్వారా స్పష్టతనిచ్చారు.

​ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా అకడమిక్ డైరెక్టర్ మరియు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ జి. పుష్ప చక్రపాణి వ్యవహరించారు. జువాలజీ విభాగం ఇంచార్జ్ హెడ్ డాక్టర్ కిషోర్ మెండం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. అనిత కుమారి కోఆర్డినేటర్లుగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.