|   
🔴 BREAKING NEWS ► Palamuru University Guest Faculty Recruitment : పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి ఇలా! Akhil Akkineni Movie Hit : అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ సక్సెస్.. తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఎమోషనల్! Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు
Skip to content

IPL 2026 : బౌలర్లను చూడను బంతినే చూస్తా.. ఆర్సీబీపై వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్

Guwahati, Surya News: ఐపీఎల్ (IPL 2026)లో భాగంగా గువహటి వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి ఈ సీజన్‌లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

ఆర్సీబీ బ్యాటర్ల మెరుపులు

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజర్ బాటర్ ఫిల్ సాల్ట్ (0) గోల్డెన్ డక్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) 40 బంతుల్లో 63 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) 36 పరుగులు చేయగా, చివర్లో వెంకటేష్ అయ్యర్ (29), రొమారియో షెపర్డ్ (22) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు స్కోరు 200 మార్కును దాటగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (13) త్వరగానే పెవిలియన్ చేరాడు. కానీ ఆ తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసిన వైభవ్ ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసిన వైభవ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

జట్టును గెలిపించిన ధ్రువ్ జురెల్

వైభవ్ అవుట్ అయిన వెంటనే షిమ్రాన్ హెట్మయర్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (3) కూడా పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ 134 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. జురెల్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా (24 నాటౌట్) అతనికి చక్కని సహకారం అందించాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp