‘పెద్ది’ (Peddi Movie) కలెక్షన్ల సునామీ.. కానీ హీరోయిన్పై ట్రోల్స్ ఎందుకు?

హైదరాబాద్, సూర్య న్యూస్: మెగా పవర్స్టార్ రామ్చరణ్ (Ram Charan) హీరోగా సంచలన దర్శకుడు బుచ్చిబాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ (Peddi) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే రూ.292 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ చిత్రంలో అప్పలసూరి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) పాత్రపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. కేవలం గ్లామర్కే పరిమితం అయిందని, పాత్రలో ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.
డైరెక్టర్ చెప్పిందే ఆ అమ్మాయి చేసింది.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
జాన్వీ కపూర్పై జరుగుతున్న ఈ సోషల్ మీడియా ట్రోలింగ్పై సీనియర్ నటుడు జగపతి బాబు తీవ్రంగా స్పందించారు. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన జాన్వీకి మద్దతుగా నిలిచారు. సినిమా విషయాల్లో నటీనటులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని నెటిజన్లకు సూచించారు. పాపం ఆ అమ్మాయి ఏం చేసిందని, డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu Sana) ఏం చెబితే అదే చేసిందని జగపతి బాబు స్పష్టం చేశారు. ఒక నటుడిగా లేదా నటిగా దర్శకుడి మాట వినడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. కొన్నిసార్లు స్క్రీన్పై అనుకున్నది సరిగ్గా వర్కవుట్ కాకపోవచ్చని, అంతమాత్రానికే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతూ జాన్వీ కపూర్కు తాను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నానని జగపతి బాబు వెల్లడించారు.
📲 మరిన్ని తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ మరియు వివరణాత్మక కవరేజ్ కోసం Surya News WhatsApp Channel లో చేరండి 👇
