Skip to content

Warangal : కేఎంసీలో ర్యాగింగ్ కలకలం.. ఏడుగురు సీనియర్ విద్యార్థులపై వేటు!

వరంగల్, సూర్య న్యూస్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై కాలేజీ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేయడంతో పాటు వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

ఏం జరిగిందంటే?

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

మార్చి 29వ తేదీ రాత్రి హాస్టల్ టెర్రస్‌పై జూనియర్ విద్యార్థులను పిలిచిన సీనియర్లు, వారికి ‘నీల్ డౌన్’, ‘ఎయిర్ చైర్’ వంటి శిక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాట్సాప్ మెసేజ్‌లలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదనే సాకుతో గంటల తరబడి జూనియర్లను వేధించినట్లు సమాచారం. దీనిపై యూజీసీ (UGC) యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

యాజమాన్యం చర్యలు:

కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సంధ్య నేతృత్వంలోని అంతర్గత విచారణ కమిటీ ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించింది. దీని ప్రకారం:

నిందితులైన ఏడుగురు సీనియర్లను 6 నెలల పాటు అకాడమిక్స్ నుండి సస్పెండ్ చేశారు.

ఒక సంవత్సరం పాటు హాస్టల్ నుండి శాశ్వతంగా బహిష్కరించారు.

చట్టపరమైన చర్యల కోసం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp