
ఒడిశా, సూర్య న్యూస్ : ఒడిశా (Odisha) రాష్ట్రంలో ఒక అత్యంత దారుణమైన మరియు హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తన సోదరి బ్యాంక్ ఖాతా (Bank Account) నుంచి కేవలం రూ. 20,000 తీసుకోవడానికి ఒక అమాయకపు తమ్ముడు నరకయాతన అనుభవించాడు. ఆమె మరణించిందని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు ఏమాత్రం కనికరించలేదు. డబ్బులు కావాలంటే ఆమె స్వయంగా రావాల్సిందే అని సిబ్బంది కరాఖండిగా తేల్చి చెప్పారు.
అధికారుల తీరుతో తీవ్ర నిరాశకు లోనైన ఆ వ్యక్తి ఎవరూ ఊహించని ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన సోదరి మరణాన్ని నిరూపించేందుకు ఏకంగా ఆమె సమాధిని తవ్వాడు. ఆ తర్వాత ఆమె అస్థిపంజరాన్ని (Skeleton) బయటకు తీసి నేరుగా బ్యాంక్ (Bank) కు తీసుకెళ్లాడు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ వ్యవస్థలో మానవత్వం ఎంతలా కొరవడిందో అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన ప్రస్తుత బ్యాంక్ నిబంధనలు (Bank Rules) మరియు అధికారుల నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరు క్లెయిమ్ చేయని బ్యాంక్ ఖాతాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు నిరుపయోగంగా పడి ఉందని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా వెల్లడించారు. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం మరియు కఠినమైన రూల్స్ వల్లే సామాన్యుల కష్టార్జితం ఇలాగే బ్యాంకుల్లో ఉండిపోతోందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.