|   
🔴 BREAKING NEWS ► Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం!
Skip to content

Telugu University News : తెలుగు వర్సిటీలో బి.డిజైన్ విద్యార్థుల వినూత్న నిరసన.. 7వ రోజుకి చేరిన దీక్ష

Hyderabad, Surya News: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) నాంపల్లి ప్రాంగణాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు చేస్తున్న పోరాటం మరింత ఉధృతంగా మారుతోంది. తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు (Hunger Strike) నేటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. రోజురోజుకూ ఈ ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు వినూత్న రీతిలో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు.

ముఖ్యంగా బి.డిజైన్ (B.Design) విద్యార్థులు తమ సృజనాత్మక కళారూపాలు మరియు అద్భుతమైన చిత్రలేఖనాల ద్వారా దీక్షా శిబిరంలో అందరినీ ఆకట్టుకున్నారు. నాంపల్లి క్యాంపస్ ప్రాముఖ్యతను మరియు దానిని పరిరక్షించాల్సిన అవసరాన్ని తమ కళాఖండాల ద్వారా హృదయాలకు హత్తుకునేలా ప్రదర్శించారు. ఇక్కడ విద్యార్థులు లేరు అనే అపోహతో క్యాంపస్ ను మ్యూజియంకు అప్పగించాలని ప్రభుత్వం (Telangana Government) ఆలోచిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అపోహను వీడి, ముందుగా ఇక్కడ చదువుతున్న విద్యార్థుల ప్రతిభను ప్రత్యక్షంగా చూసి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే పేద విద్యార్థులకు నాంపల్లి క్యాంపస్ (Nampally Campus) అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. మెట్రో (Metro) మరియు బస్సు లాంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో భద్రత ఉందని తెలిపారు. ఈ కారణం వల్లే తల్లిదండ్రులు కూడా ధైర్యంగా తమ పిల్లలను ఇక్కడ చదువుకోడానికి పంపిస్తున్నారని వారు గుర్తు చేశారు. తమ ఇంటి తర్వాత అత్యధిక సమయం గడిపేది ఈ సరస్వతి నిలయంలోనే అని విద్యార్థులు ఉద్వేగంతో చెప్పారు. ఇది తమ మరో ఇల్లు అని, దీన్ని కబ్జా చేయవద్దు అంటూ వారు ప్రభుత్వాన్ని కోరారు.

​ఈ దీక్షా కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి (Vice Chancellor) డాక్టర్ తూమాటి దొణ్ణప్ప కుమారుడు టి. సుధాకర్ హాజరయ్యారు. విద్యార్థుల ఉద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించారు. నాంపల్లి క్యాంపస్‌ను ఎవరికీ అప్పగించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్యాంపస్ పూర్తిగా విద్యార్థుల ఆస్తి అని స్పష్టం చేశారు.

​ఈ నిరసన కార్యక్రమంలో అధ్యాపకులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మరియు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థుల ఉద్యమానికి వారు తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. నాంపల్లి క్యాంపస్‌ను యథాతథంగా కొనసాగిస్తామని ప్రభుత్వం వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp