
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj) జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీ పురస్కారాల్లో (National Awards) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో భాగంగా ఏపీకి మొత్తం ఐదు జాతీయ అవార్డులు (5 Awards) లభించాయి. పంచాయతీరాజ్ శాఖలో రెండు విభాగాల్లో ప్రథమ పురస్కారం, ఒక విభాగంలో ద్వితీయ పురస్కారం, మరో రెండు విభాగాల్లో తృతీయ పురస్కారం వరించాయి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లో (Rashtriya Gram Swaraj Abhiyan) ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగవ స్థానంలో ఉన్న ఏపీ నేడు దేశంలోనే తొలిస్థానానికి చేరింది.
అలాగే జల్ సంచయ్ జన్ భాగీదారిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఏపీ పంచాయతీరాజ్ శాఖ పలు జాతీయ పురస్కారాలు (Panchayat Awards) అందుకుంది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.