
హైదరాబాద్, సూర్య న్యూస్: మహిళా రిజర్వేషన్ల (Women’s Reservation) అంశంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ‘మహిళా ఆగ్రహ ర్యాలీ’ (Mahila Agraha Rally) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు భార్గవి రెడ్డి (Bhargavi Reddy), సీనియర్ నాయకులు కాసాని సంతోష్ (Kasani Santosh) పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని వారు విమర్శించారు. సగం జనాభాగా ఉన్న మహిళలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బీజేవైఎం (BJYM) నాయకులు పీఎస్ కార్తీక్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. మహిళా లోకానికి కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు హెచ్చరించారు.