
హైదరాబాద్, సూర్య న్యూస్: సంచలనం రేపిన పోక్సో (POCSO) కేసులో అరెస్టు అయిన బండి సాయి భగీరథ్ ఐఫోన్ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ మొబైల్ ఫోన్ (Mobile Phone) లో కీలక ఆధారాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ (Forensic) విశ్లేషణ తర్వాత కేసులో అనేక సీక్రెట్స్ బయటపడే అవకాశం ఉంది. మే 8న ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న సాయి భగీరథ్ను శనివారం రాత్రి నర్సింగి సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని పెట్బషీరాబాద్ (Petbasheerabad) పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు.
అక్కడ పోలీసులు సుమారు రెండు గంటల పాటు విచారణ జరిపి అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ సమయంలోనే భగీరథ్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ (Magistrate) ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ (Judicial Custody) విధించింది. ప్రస్తుతం అతడు చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. సోమవారం సాయి భగీరథ్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఒక పిటిషన్ (Petition) దాఖలు చేయనున్నారు. బాధితురాలు లైంగిక దాడికి గురైనట్లు ఆరోపణలు ఉన్న నాలుగు ప్రదేశాలకు అతడిని తీసుకెళ్లి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు ఈ కేసులో ఎఫ్ఐఆర్ (FIR) లో బండి సాయి బగీరథ్ తో పాటు ఇతరులు అని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదిలా ఉండగా భగీరథ్ కు మద్దతుగా సోషల్ మీడియా (Social Media) లో పోస్టులు పెట్టిన 14 మంది ఇన్ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. డబ్బులు తీసుకుని ఒకే రకమైన కంటెంట్తో వీరు వీడియోలు (Videos) చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే బాధితురాలి ఫోటోలు, వివరాలు బయటపెట్టిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భగీరథ్ తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో బెయిల్ (Bail) కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంది.