|   
🔴 BREAKING NEWS ► Palamuru University Guest Faculty Recruitment : పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి ఇలా! Akhil Akkineni Movie Hit : అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ సక్సెస్.. తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఎమోషనల్! Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు
Skip to content

Shahbad Murders Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడు రాజ్ కుమార్ ఏం చేశాడంటే?

Shahbad Murders Case: రంగారెడ్డి, సూర్య న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) తీవ్ర సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసు (Shahbad Murders Case) నిందితుడు సైకో రాజ్ కుమార్ (Psycho Raj Kumar) కథ విషాదాంతం అయింది. పోలీసుల కళ్లు కప్పి పరారైన ఈ నరహంతకుడు చివరకు శవమై కనిపించాడు. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కొత్తూరు (Kothur) మండలం పంజర్ల పరిధిలో రాజ్ కుమార్ ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు (Police) సోమవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

​మృతుడి పక్కనే విషం సీసా లభించడంతో అతను పాయిజన్ తాగి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల క్రితం షాబాద్ మండలంలో ఒకేసారి ఆరుగురిని రాజ్ కుమార్ అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ సామూహిక హత్యల (Mass Murders) ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. నిందితుడి కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో (Special Teams) ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణతో పాటు బెంగళూరులోనూ సోదాలు నిర్వహించారు. రాజ్ కుమార్ ను పట్టిస్తే రూ. 2 lakhs రివార్డు (Reward) కూడా ప్రకటించారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

రాజ్ కుమార్ చేతిలో బలైన వారిలో అతని భార్య పార్వతి సరిత (30), కుమారులు పరిక్షిత్ (3), దైవిక్షిత్ (2) ఉన్నారు. వీరితో పాటు చిట్యాల రుక్కమ్మ (65), ఆమె కుమార్తె చిట్యాల లక్ష్మి (45), మరో మైనర్ బాలిక (17)లను కూడా వేటాడి చంపాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన తర్వాత రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఒకే చోట ముగ్గురిని, మరో చోట ముగ్గురిని చంపేశానని చెప్పి పరారయ్యాడు. ఈ విషయం తెలియగానే సిటీ పోలీస్ కమిషనర్ (CP Tarun Joshi) డాక్టర్ తరుణ్ జోషి, డీసీపీ (DCP Yogesh Gautam) యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. చివరకు నిందితుడు పంజర్ల సమీపంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ కేసు ముగిసింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp