|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

Police Ego : ఖాకీ అహంకారానికి బలి.. జయరాజ్, బెనిక్స్ కేసులో ఆ 9 మంది పోలీసులకు మరణశిక్ష ఎందుకు?

తూత్తుకుడి, సూర్య న్యూస్: ఒక చిన్న గొడవ.. ఒక సామాన్య తండ్రీకొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. ఖాకీ అహంకారం (Police Ego) పతాక స్థాయికి చేరితే ఎంతటి దారుణానికి ఒడిగడతారో చెప్పడానికి తమిళనాడులోని తూత్తుకుడి (Tuticorin) జిల్లా సాత్తాంకుళం ఘటన నిదర్శనం. లాక్ డౌన్ నిబంధనల సాకుతో ఇద్దరు సామాన్యులను చిత్రహింసలు పెట్టి చంపిన 9 మంది పోలీసులకు మరణశిక్ష (Death Penalty) విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఒక మహిళా కానిస్టేబుల్ సాహసం ఈ కేసును ఎలా మలుపు తిప్పింది? అనే పూర్తి వివరాలు మీకోసం.

చిన్న కారణం.. పెను విషాదం!

2020 జూన్ 19న లాక్ డౌన్ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయం కంటే అదనంగా 15 నిమిషాలు షాపు తెరిచి ఉంచారనే కారణంతో పి.జయరాజ్ (P. Jayaraj), ఆయన కుమారుడు జె.బెనిక్స్ (J. Bennix)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కేవలం జరిమానాతో పోయే చిన్న విషయం. కానీ, అక్కడ ఉన్న పోలీసుల ఈగో హర్ట్ అయింది. వారు ప్రశ్నించినందుకు కోపంతో స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రంతా అమానుషంగా హింసించారు. వారిని నగ్నంగా మార్చి, లాఠీలతో ప్రైవేట్ భాగాల్లో విపరీతంగా కొట్టడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి చివరకు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.

​వ్యవస్థను ఎదిరించిన ‘రేవతి’ సాహసం

​ఈ కేసులో పోలీసులు సాక్ష్యాలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. స్టేషన్‌ను శుభ్రం చేయించి, సీసీటీవీ ఫుటేజీని మాయం చేశారు. కానీ, అదే స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రేవతి (Head Constable Revathy) తన మనసాక్షికి విలువిచ్చారు. తోటి సిబ్బంది ఒకవైపు, పై అధికారుల ఒత్తిడి మరోవైపు ఉన్నా ఆమె భయపడలేదు. మేజిస్ట్రేట్ విచారణలో ఆమె ధైర్యంగా నిజం చెప్పారు. పోలీసులు స్టేషన్‌ను ఎంత శుభ్రం చేసినా, ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను మేజిస్ట్రేట్‌కు చూపించారు. రేవతి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ కేసు దిశనే మార్చేసింది. ఆమె జ్ఞాపకశక్తితో సంఘటన జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించడం సీబీఐ (CBI) దర్యాప్తుకు దిక్సూచిలా నిలిచింది.

​హైకోర్టు జోక్యం – సీబీఐ విచారణ

​ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో మద్రాస్ హైకోర్టు (Madurai Bench) ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున విచారణను సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణలో పోలీసుల దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. రేవతి సాక్ష్యంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్టులు కూడా పోలీసులు చేసిన హత్యను శాస్త్రీయంగా నిరూపించాయి. ఖాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన సామాన్యులను చంపే హక్కు లేదని కోర్టు భావించింది.

​ఖాకీ అహంకారం.. డిపార్ట్మెంట్‌కు కనువిప్పు

​ఈ కేసు కేవలం ఒక లాకప్ డెత్ మాత్రమే కాదు, ‘మనల్ని డిపార్ట్మెంట్ కాపాడుతుందిలే’ అనే ధీమాతో ఉన్న పోలీసులకు ఒక గుణపాఠం. ఎటువంటి నేర చరిత్ర లేని ఒక సామాన్యుడి పట్ల పోలీసులు ఇంత జులుం ప్రదర్శించడం వెనుక ఉన్నది కేవలం తమ అధికారాన్ని నిరూపించుకోవాలనే అహంకారమే. పోలీసుల ఈగో హర్ట్ అయితే ఎంతకైనా తెగిస్తారనే విమర్శలకు ఈ తీర్పు ఒక అడ్డుకట్ట వేసింది. ఈ మరణశిక్ష తీర్పు దేశంలోని ప్రతి పోలీస్ అధికారికి ఒక హెచ్చరికగా నిలవనుంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp