|   
🔴 BREAKING NEWS ► TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్ Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు
Skip to content

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘన విజయం : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొన్నం అశోక్ గౌడ్

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ అడ్వకేట్ పొన్నం అశోక్ గౌడ్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు, బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన ఈ కలయిక న్యాయవాద వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది, బుధవారం జరిగిన ఈ సమావేశంలో అశోక్ గౌడ్ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలుపగా వీరి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు, సమావేశంలో నేతలు శాలువాలు, పుష్పగుచ్ఛాలు, మొక్కలు ఇచ్చిపుచ్చుకుని భవిష్యత్ సహకారం పై చర్చించారు.

స్పష్టమైన మెజారిటీతో గెలుపు

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు సుప్రీం కోర్టు ఆదేశాలతో జనవరి 30న సకాలంలో జరిగాయి, సుమారు నెల రోజుల పాటు ఓట్ల లెక్కింపు కొనసాగగా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ విధానంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కనీసం 1085 ఓట్ల కటాఫ్ మార్కును చేరుకుని పొన్నం అశోక్ గౌడ్ విజయం సాధించిన మొదటి అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు, లెక్కింపు తొలి రోజు 41 శాతం ఓట్లు చెల్లనివిగా తేలినప్పటికీ ఆయన స్పష్టమైన మెజారిటీతో గెలుపొందడం విశేషం.

సుదీర్ఘ న్యాయవాద అనుభవం

పొన్నం అశోక్ గౌడ్ కు న్యాయవాద వృత్తిలో 38 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది, ఆయన గతంలో అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలు అందించారు, అలాగే తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రెండు సార్లు పనిచేశారు, ప్రస్తుతం టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈయన మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్వయానా అన్న.

మెరుగైన సదుపాయాలపై ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం మరియు న్యాయవాద వర్గాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ఈ మర్యాదపూర్వక కలయిక అద్దం పడుతోంది, రాబోయే రోజుల్లో బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదులకు ఆరోగ్య బీమా పెంపు మరియు గృహ వసతి వంటి మెరుగైన సదుపాయాలు అందే అవకాశం ఉందని న్యాయవాదులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp