
చెన్నై, సూర్య న్యూస్: తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) రసవత్తరంగా మారాయి. ఊహించని మలుపులతో రోజుకో కొత్త ట్విస్ట్ తెరమీదకు వస్తోంది. తాజాగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా బద్ధ శత్రువులైన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) మధ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో వెనుకబడిన టీవీకే (TVK) అధినేత విజయ్ (Vijay) కు గవర్నర్ ఊహించని షాక్ ఇచ్చారు. తగినంత బలం లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు గవర్నర్ అనుమతి నిరాకరించారు.
ఈ పరిణామంతో రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. తమిళనాడులో (Tamil Nadu) ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 118గా ఉంది. ప్రస్తుతం టీవీకే కు కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. వీరితో కలుపుకుని విజయ్ కు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. కానీ అధికారం చేపట్టాలంటే కచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బలం నిరూపించుకోలేకపోవడంతో గవర్నర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!
తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.
📲 Join WhatsApp Channelమరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కు 59 సీట్లు రాగా, అన్నాడీఎంకే కు 47 సీట్లు వచ్చాయి. వామపక్షాలు మరియు ఐయూఎంఎల్ పార్టీలు డీఎంకే కూటమిలోనే ఉన్నాయి. కూటమిలోని సీపీఎం (CPM) కు రెండు, సీపీఐ (CPI) కు రెండు, ఐయూఎంఎల్ (IUML) కు రెండు సీట్లు దక్కాయి. గవర్నర్ నిర్ణయంతో అధికార పీఠం దక్కించుకునేందుకు డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు తమిళ రాజకీయాల్లో (Tamil Politics) ఒక్కసారిగా హీట్ పెంచేశాయి.



