బీజేపీ నేత రాజుగౌడ్పై దాడి..
కాంగ్రెస్ పనేనని కమలనాథుల ఆరోపణ

మునుగోడు, (సూర్య న్యూస్ తెలుగు): ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని మునుగోడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బూడిద బిక్షంగౌడ్ మండిపడ్డారు. గట్టుప్పల్ మండలం అంతంపేటకు చెందిన బీజేపీ నేత వీరమల్ల రాజుగౌడ్పై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అండదండలతోనే కాంగ్రెస్ వర్గాలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నాయని ఆరోపించారు.

ఇటీవల నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటన మరువకముందే.. తాజాగా రాజుగౌడ్పై దాడి జరగడం ఆందోళనకరమన్నారు. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



